గోదావరిఖనిలో ఉచిత ప్రకృతి వైద్య చికిత్స శిబిరం

గోదావరిఖనిలో ఉచిత ప్రకృతి వైద్య చికిత్స శిబిరం

గోదావరిఖని, వెలుగు :  రామగుండం లయన్స్​ క్లబ్​ ఆధ్వర్యంలో రాజస్థాన్​కు చెందిన రామ్​ మనోహర్​ లోహియా ఆరోగ్య జీవన్​ సంస్థాన్​ సహకారంతో గురువారం నుంచి స్థానిక సిగ్మా హాస్పిటల్​లో ఉచిత ప్రకృతి వైద్య చికిత్స శిబిరం ప్రారంభించారు. ఈ శిబిరాన్ని లయన్స్​ క్లబ్​ జోన్​ చైర్​పర్సన్​ పి.మల్లికార్జున్​, ప్రెసిడెంట్​ ఎల్లప్ప, ఐఎంఏ ప్రెసిడెంట్​ క్యాస శ్రీనివాస్​ ప్రారంభించారు.

 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధుల నివారణ కోసం ఆక్యూ ప్రెషర్, సుజోక్ కప్పింగ్, వైబ్రేషన్ థెరఫీతో డాక్టర్ వైష్ణవ్ చికిత్స అందిస్తున్నారని, ఈ నెల 19వ తేది వరకు జరగనున్న ఈ ఉచిత వైద్య శిబిరాన్ని పారిశ్రామిక ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అందించే ప్రకృతి వైద్యంతో దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందాలని వారు సూచించారు. 

ఈ కార్యక్రమంలో డాక్టర్లు టిహెచ్ ఆకాష్ శర్మ, పిహెచ్ విష్ణు లాండ్యే, క్లబ్​ ట్రెజరర్ రాజేంద్ర కుమార్, కజాంపురం రాజేందర్, బంక రామస్వామి, పి.శరత్ బాబు, బేణి గోపాల్ త్రివేది, సత్యనారాయణ, రంగమ్మ, తదితరులు పాల్గొన్నారు.