Rainy season: ఈ పండ్లు తిన్నారంటే.. దవాఖానాకు పరిగెత్తాల్సిందే..

Rainy season: ఈ పండ్లు తిన్నారంటే.. దవాఖానాకు పరిగెత్తాల్సిందే..

వర్షాకాలంలో పండ్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.  వర్షాకాలంలో తేమశాతం ఎక్కువుగా ఉండట వలన పండ్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.   త్వరగా కుళ్ళిపోతాయి.   బ్యాక్టీరియా కారణంగా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే కొన్ని పండ్లు ఉన్నాయి. ఇప్పుడు  వాటి గురించి తెలుసుకుందాం. . 

వర్షాకాలం ఎంజాయ్‌మెంటే వేరు.. ఈ సీజన్‌లో ప్రకృతి.. వర్షపు జల్లులు మనకు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. తొలకరి  జల్లులతో పాటు బోలెడు వ్యాధులను కూడా తనతో తీసుకొస్తుంది.  వాతావరణంలో తేమ శాతం పెరగడం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌లు మనపై దాడి చేస్తాయి.

సీతాఫలం:  వర్షాకాలం.. ఇది సీజన్​ ఫ్రూట్​.. ఇందులో ఎక్కువగా వాటర్​ కంటెంట్​ ఉంటుంది.  ఈ పండ్లలో త్వరగా బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంది.  అందుకే సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని తినాలి.  ఇది మెత్తగా ఉంటుంది.  త్వరగా పాడయిపోతుంది.  అందుకే తాజాగా ఉన్న సీతాఫలాలను తినండి.

జామ: వర్షాకాలంలో  ఈ పండులో ఎక్కువుగా బ్యాక్టీరియా చేరుతుంది.  పైకి అంతా బాగానే ఉంటుంది.   పండులో లోపల పురుగు ప్రవేశించి గుజ్జును తింటుంది.  లోపలే పురుగులను ఉత్పత్తి కూడా చేస్తుంది. అందుకే  వర్షాకాలంలో జామపండు తినేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని తినండి.  పండును కొరుక్కొని తినే కంటే ముక్కలు ముక్కలుగా చేసుకొని తినండి. 

మామిడి పండ్లు: కొన్ని రకాలకు చెందిన మామిడి పండ్లు వర్షాకాలంలో లభిస్తాయి.  అయితే ఇవి ఎక్కువ నిల్వ ఉండవు.. ఈ పండ్లు త్వరగా చెడిపోతాయి.  తియ్యగా ఉన్నాయి కదా ఎట్ట పడితే అట్ట తినకూడదు.  ఎక్కువ ఫంగస్​  ఈ పండ్లలోనే ఉంటుంది. పచ్చికాయలను పక్వానికి వచ్చేలా చేసేందుకు కొన్ని రకాల పద్దతులను పాటిస్తారు.  ఎక్కువగా పండిన మామిడి పండ్లు  తింటే ఇన్ఫెక్షన్లు వస్లాయి.  అలాంటి పండ్లను తినడం వల్ల అలెర్జీ కూడా వస్తుంది.

లిచీ : ఇది  లిచీ అనేది సీజనల్ పండు,.   వర్షాకాలంలో దీనిని జాగ్రత్తగా తీసుకోవాలి. లిచీని సరిగ్గా నిల్వ చేయకపోతే, అది త్వరగా కుళ్ళిపోతుంది. 

తరిగిన పండ్లు:  పండ్ల వ్యాపారులు బండ్లపై కోసి అమ్ముతుంటారు.  వీటిని బహిరంగ ప్రదేశంలో ఉంచడం వలన సూక్ష్మక్రిములు త్వరగా చేరుతాయి. వీటివలన అతిసార వ్యాధి వచ్చే  అవకాశం ఉంది.  వాంతులు.. విరోచనాలు.. కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంది. అందుకే తాజా పండ్లను ఇంట్లోనే కోసుకొని వెంటనే తినాలి. 

వర్షాకాలంలో పండ్లు కోసిన వెంటనే తినాలి. కట్ చేసి, తోలు తీసివేసిన చాలాసేపటి వరకు వీటిని పక్కన పెడితే అనారోగ్యాల ముప్పు పెరుగుతుంది. వీటిపై బ్యాక్టీరియా, శిలీంధ్రాలు సులభంగా చేరుతాయి, అవి త్వరగా చెడిపోతాయి. వీటిని తినడం వల్ల డయేరియా, వాంతులు, కడుపు నొప్పి వంటి సమస్యలు రావచ్చు. అందుకే వాటికి దూరంగా ఉండటం మంచిది.  

ఇక వర్షం పడిందంటే చాలు స్ట్రీట్​ ఫుడ్స్​కు ప్రాధాన్యత ఇస్తారు.   ఇవి చాలా రుచికరంగా ఉంటాయి.  ఎంత రుచి ఉంటాయో.. తింటే అంతకన్నా ఎక్కువ రోగాలు వస్తాయి. ఈగలు, దోమలు, ఇతర బ్యాక్టీరియా ఆ పదార్దాలపై చేరుతాయి.  వ్యాపారులు వాటిని ప్రతి సారి శుబ్రంగా కడగలేరు.  వర్షాకాలంలో నీరు కూడా కలుషితమవుతుంది.ఆ నీటినే  ఫుడ్స్ తయారీలో వాడవచ్చు. ఇలా తయారుచేసిన ఆహారాలు తింటే డైజెస్టివ్ ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ వంటి ప్రమాదాలు పెరుగుతాయి.  కాబట్టి బయటి ఫుడ్​ కు దూరంగా ఉండండి.