![జీఎస్టీపై ఎఫ్టీసీసీఐ సమావేశం](https://static.v6velugu.com/uploads/2024/02/ftcci-to-hold-a-conclave-on-gst-and-globalization-in-hyderabad_cfPuVX3C1Z.jpg)
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్టీసీసీఐఐ) శనివారం హైదరాబాద్లో "జీఎస్టీ గ్లోబలైజేషన్పై కాన్క్లేవ్" నిర్వహించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. ట్యాక్స్ ప్రాక్టీషనర్లు, కన్సల్టెంట్లు, ఐటీ, జీఎస్టీ ప్రభుత్వ అధికారులు, పరిశ్రమల ప్రతినిధులతో కూడిన 250 మందికి పైగా ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఈ పన్ను విధానం దేశాన్ని ఏకం చేసిందని అన్నారు.
జీఎస్టీ వల్ల వ్యాపార సంస్థలు తరచూ పన్నుల అధికారులను కలవడం తగ్గిందని అన్నారు. అనేక దేశాలలో జీఎస్టీ రేట్లు 3 నుండి 5 శాతం వరకు ఉంటాయని, భారతదేశంలో ఇవి 5–28 శాతం వరకు ఉన్నాయని కోదండరామ్ అన్నారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం పరిమితిని చాలా రాష్ట్రాల్లో మాదిరిగా రూ. 40 లక్షల వార్షిక టర్నోవర్కు పెంచాలని ఎఫ్టీసీసీఐ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది.