- భద్రాద్రికొత్తగూడెం డీఎంహెచ్వో తుకారాం రాథోడ్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో 1,708 మంది కుష్టు వ్యాధి అనుమానితులను గుర్తించినట్టు డీఎంహెచ్వో డాక్టర్ తుకారం రాథోడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.గత నెల 18 నుంచి 31వరకు జిల్లా వ్యాప్తంగా ఇంటింటి సర్వే చేపట్టామని, సర్వేలో 1436 టీమ్లు పాల్గొన్నాయని తెలిపారు.
2,47,693 ఇండ్లను సందర్శించి 8,89,635మంది వ్యక్తులను పరిశీలించామని పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అనుమానితులను వైద్య పరీక్షలు చేసిన నిర్ధారించనున్నట్టు తెలిపారు. ఈ ప్రకారంగా ఇప్పటి వరకు నలుగురిని కుష్టు వ్యాధి గ్రస్తులుగా గుర్తించామని పేర్కొన్నారు.
