వరుసగా 14వ రోజు పెరిగిన పెట్రోల్‌ ధరలు

వరుసగా 14వ రోజు పెరిగిన పెట్రోల్‌ ధరలు
  • పెట్రోల్‌పై 0.51, డీజిల్‌పై 0.61 పెంపు

న్యూఢిల్లీ: ప్రజలపై వరుసగా 14వ రోజు పెట్రో బాంబు పడింది. గత 14 రోజులుగా రోజు పెట్రోల్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో శనివారం పెట్రోల్‌పై లీటరుకు 0.51, డీజిల్‌పై 0.61 పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ.78.88 ఉండగా.. డీజిల్‌ ధర 77.67కి చేరింది. ముంబైలో ధర రూ.85.7 ఉండగా.. డీజిల్‌ ధర రూ.75.54 ఉంది. హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.81.88, డీజిల్ ధర డీజిల్‌ ధర రూ.75.91కి చేరింది. ఈనెల 9 నుంచి ఇప్పటి వరకు పెట్రోల్‌, డీజిల్‌ పై సుమారు రూ.7 పెరిగింది.