- కొత్త గరిష్టాలకు 10 గ్రాముల గోల్డ్ ధర
న్యూఢిల్లీ : ఒక వైపు ఈక్విటీ మార్కెట్ కొత్త రికార్డ్లు క్రియేట్ చేస్తుంటే మరోవైపు గోల్డ్ కూడా ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. గ్లోబల్గా ఔన్సు (28.34 గ్రాముల) గోల్డ్ ధర 2,100 డాలర్లను దాటింది. అదే స్పాట్ గోల్డ్ అయితే ఔన్స్కు 2,085.76 డాలర్లకు చేరుకుంది. సోమవారం సెషన్లో గోల్డ్ రేట్లు 3 శాతం ర్యాలీ చేశాయి. 2020 ఆగస్టులో నమోదైన ఆల్ టైమ్ హై లెవెల్ను అధిగమించింది. డాలర్ వాల్యూ పడుతుండడంతో గోల్డ్కు డిమాండ్ పెరుగుతోంది. అంతేకాకుండా మిడిల్ ఈస్ట్లో కొనసాగుతున్న ఇజ్రాయిల్ – హమాస్ యుద్ధం కూడా గోల్డ్ రేట్లకు సపోర్ట్గా ఉన్నాయి. అదే ఇండియన్ ఎంసీఎక్స్ మార్కెట్లో అయితే 10 గ్రాముల గోల్డ్ రేటు 63,500 దగ్గర ఆల్ టైమ్ హైని నమోదు చేసింది.
పెళ్లిళ్ల సీజన్ కావడంతో గోల్డ్ డిమాండ్ బాగుందని జ్యుయెలర్లు చెబుతున్నారు. వచ్చే ఏడాది మధ్యలో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ సంకేతాలు ఇచ్చారు. వడ్డీ రేట్లు తగ్గితే ఇన్వెస్టర్లకు బాండ్లు, ఎఫ్డీలు వంటి అసెట్స్పై తక్కువ రిటర్న్స్ వస్తాయి. ఫలితంగా గోల్డ్ వైపు ఇన్వెస్టర్లు చూస్తున్నారని కేసీఎం ట్రేడ్ ఎనలిస్ట్ టిమ్ వాటెరర్ పేర్కొన్నారు. కాగా, ఫెడ్ చైర్మన్ తాజా స్పీచ్లో పాలసీని కఠినం చేయమని, అలా అని సులభం కూడా చేయమని అన్నారు. దేశంలో గోల్డ్ ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది.పెళ్లిళ్లలో గిఫ్ట్గా బంగారాన్ని ఇవ్వడం సాధారణమని, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గానూ మంచి చాయిస్ అని ఎనలిస్టులు వెల్లడించారు. కానీ, ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే జాగ్రత్త వహించాలన్నారు.