వచ్చే నెల 1 నుంచి  జీపీ అకౌంట్లలో ఫండ్స్

వచ్చే నెల 1 నుంచి  జీపీ అకౌంట్లలో ఫండ్స్

గ్రామాల అభివృద్ధి కోసం వచ్చే నెల 1 నుంచి ఎలాంటి నిధులనైనా నేరుగా పంచాయితీ అకౌంట్లలో జమ చేస్తామని ఆర్థిక  మంత్రి హరీశ్  రావు తెలిపారు. ఇక నుంచి గ్రామ పంచాయితీల్లో నిధులు, బిల్లుల చెల్లింపుల సమస్య ఉండదన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లాలోని కులబ్ గుర్, కంగ్టీ, నారాయణఖేడ్ ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. దీన్ దయాళ్ జాతీయ పంచాయితీ 2021–--22 అవార్డుల ప్రదానోత్సవం, ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమిష్టి కృషితో  గ్రామాలు అభివృద్ధి దిశగా పయనిస్తున్నాయని అన్నారు. తెలంగాణ గ్రామాలను చూసి దేశం ఆశ్చర్యపోతున్నదన్నారు. సంగారెడ్డి జిల్లాలో 27 గ్రామ పంచాయితీలు జిల్లా స్థాయి అవార్డులు అందుకున్నాయని ఆయన తెలిపారు.