బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా బీజేవైఎం తాండూర్ మండల ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి భాస్కర్గౌడ్పై హత్యాయత్నం చేసిన టీఆర్ఎస్ గూండాలను అరెస్ట్ చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, పెద్దపల్లి మాజీ ఎంపీ డాక్టర్ జి. వివేక్వెంకటస్వామి డిమాండ్ చేశారు. నాలుగు రోజులుగా మంచిర్యాల గవర్నమెంట్హాస్పిటల్లో చికిత్స పొందుతున్న భాస్కర్గౌడ్ను పార్టీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్రావుతో కలిసి ఆదివారం పరామర్శించారు. భాస్కర్గౌడ్ తాండూర్లో జరిగిన ఓ ఫంక్షన్కు హాజరై రేచినికి వెళ్తుండగా టీఆర్ఎస్కు చెందిన ఎనిమిది మంది బైక్లపై మారణాయుధాలతో వచ్చి దాడి చేశారన్నారు.
సోషల్మీడియాలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా పోస్టులు పెడితే చంపుతామని బెదిరించారన్నారు. పోలీసులు నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్చేశారు. అలాగే హాజీపూర్ మండలం రాపల్లి గ్రామానికి చెందిన సునీల్రావు తల్లి అనారోగ్యంతో ఇటీవల చనిపోవడంతో వారి ఇంటికి వెళ్లి సునీల్రావును పరామర్శించారు.బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి బొమ్మెన హరీశ్గౌడ్, జైపూర్ మండల అధ్యక్షుడు చల్లా విశ్వంభర్రెడ్డి, ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి డేగ నగేశ్, లీడర్లు జాడి యేసయ్య, పోషన్న, బల్ల వెంకటేశ్, చేగొండ శ్రీనివాస్, మహిపాల్రెడ్డి, సంతోష్వర్మ పాల్గొన్నారు.
మత్స్యకారులకు వలలు పంపిణీ
చెన్నూరు నియోజకవర్గంలోని వెలాల గ్రామంలో ఇటీవల వర్షానికి నష్టపోయిన మత్స్య కార్మికులకు వివేక్ వెంకటస్వామి వలలు, ఇతర సామగ్రి పంపిణీ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఆందుగుల శ్రీనివాస్ , బీజేపీ లీడర్లు పాల్గొన్నారు.