జీ 2..గూఢచారి సీక్వెల్ షురూ

జీ 2..గూఢచారి సీక్వెల్ షురూ

అడివి శేష్‌‌‌‌ హీరోగా వచ్చిన ‘గూఢచారి’ చిత్రానికి సీక్వెల్‌‌‌‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘జీ 2’. బనితా సంధు హీరోయిన్. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎకె ఎంటర్‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్ బ్యానర్‌‌‌‌పై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. సోమవారం ఈ మూవీ షూటింగ్‌‌‌‌ ప్రారంభించారు.

షూటింగ్ కోసం హైదరాబాద్‌‌‌‌లో ఐదు అంతస్తుల లావిష్ గ్లాస్ సెట్‌‌‌‌ను నిర్మించారు. ప్రస్తుతం ఇందులోనే షూటింగ్ జరుగుతోంది. ఇదొక యాక్షన్ స్పై థ్రిల్లర్. తన దేశం కోసం పోరాడటానికి ఇండియా వెలుపల మిషన్‌‌‌‌లో ఉన్న గూఢచారి కథ ఇదని మేకర్స్ తెలియ జేశారు.