
- ఏర్పాట్లపై మంత్రి గంగుల సమీక్ష
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని మరో ఏడు జిల్లాల్లో ఉన్న రేషన్ లబ్ధిదారులందరికీ వచ్చే నెల నుంచి ఫోర్టిఫైడ్ రైస్ అందించనున్నట్లు సివిల్ సప్లయ్స్ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. మంగళవారం ఆయన మినిస్టర్స్ క్వార్టర్స్లోని తన నివాసంలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ ఏర్పాట్లపై రివ్యూ నిర్వహించారు. ఇప్పటికే జయశంకర్ భూపాల పల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని రేషన్ కార్డుదారులకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.
తాజాగా రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, హన్మకొండ, మంచిర్యాల, నిర్మల్, ఖమ్మం, వికారాబాద్ జిల్లాల్లోని రేషన్ లబ్ధిదారులతో పాటు అన్ని సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, ఐసీడీఎస్, మధ్యాహ్న బోజన పథకానికి ఫోర్టిఫైడ్ రైస్ అందిస్తామని తెలిపారు. ఏప్రిల్ నుంచే పంపిణీ ప్రారంభమవుతుందని చెప్పారు.