వరంగల్లో గంజాయి చాక్లెట్లు పట్టివేత.. ఎంజీఎం సెంటర్లో పోలీసుల తనిఖీలు

వరంగల్లో  గంజాయి చాక్లెట్లు పట్టివేత.. ఎంజీఎం సెంటర్లో పోలీసుల తనిఖీలు

కాశీబుగ్గ, వెలుగు: వరంగల్​ సిటీలో గంజాయి చాక్లెట్లు అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని పట్టుకున్నట్లు మట్టెవాడ సీఐ కరుణాకర్​ తెలిపారు. వరంగల్​ ఎంజీఎం సెంటర్​లో తనిఖీలు చేస్తుండగా..  అనుమానాస్పదంగా కనిపించిన ఒడిశా రాష్ట్రం భద్రక్​ జిల్లా మాలిక్​ కాన్పాడాకు చెందిన జనార్ధన్  వద్ద గంజాయి చాక్లెట్లు దొరికినట్లు చెప్పారు. వాటిని సోలాపూర్​లో ఎక్కువ ధరకు అమ్మేందుకు తీసుకెళ్తున్నట్లుగా నిందితుడు ఒప్పుకున్నట్లు తెలిపారు. నిందితుడి వద్ద 72 గంజాయి చాకెట్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఎస్సై శివకృష్ణ, కానిస్టేబుళ్లు​నాగరాజు, సత్యనారాయణ, రవిని ఆయన అభినందించారు. 

ఏడు మోరీల వద్ద 12 కేజీల గంజాయి..

సిటీలోని హంటర్​ రోడ్​లోని ఏడు మోరీల వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా, ఇద్దరు మహిళల వద్ద 12 కేజీల గంజాయి పట్టుబడినట్లు సీఐ కరుణాకర్​ తెలిపారు. మహారాష్ట్రకు చెందిన త్రివేణి రామనాథ్  ఘెడ్కే, అంజలి రామ్​సాథే పూణేకు 12 కేజీల గంజాయి తీసుకెళ్తుండగా పట్టుకున్నట్లు చెప్పారు. గంజాయి విలువ రూ.6 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. గంజాయితో పాటు రెండు మొబైల్​ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.