భువనేశ్వర్‌‌‌‌‌‌‌‌ నుంచి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు గంజాయి ...ఇద్దరు అరెస్ట్, 34 కేజీల గాంజా పట్టి వేత

భువనేశ్వర్‌‌‌‌‌‌‌‌ నుంచి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు గంజాయి ...ఇద్దరు అరెస్ట్, 34 కేజీల గాంజా పట్టి వేత

హైదరాబాద్​సిటీ, వెలుగు: భువనేశ్వర్‌‌‌‌‌‌‌‌ నుంచి హైదరాబాద్​కు గంజాయి తరలిస్తున్న ఇద్దరిని డీటీఎఫ్​ పోలీసులు పట్టుకున్నారు. బిహార్‌‌‌‌‌‌‌‌కు చెందిన రమేశ్​ కుమార్‌‌‌‌‌‌‌‌, చందన్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ మూడు బ్యాగుల్లో గంజాయి ప్యాకెట్లను తీసుకొని భువనేశ్వర్​ఎక్స్​ప్రెస్​లో హైదరాబాద్​ వచ్చారు. 

అనంతరం జేబీఎస్‌‌‌‌‌‌‌‌ కు చేరుకొని అక్కడ గుర్తు తెలియని వ్యక్తికి ఇచ్చేందుకు వేచి చేస్తున్నారు. సమాచారం అందుకున్న  సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌ డీటీఎప్‌‌‌‌‌‌‌‌ సీఐ సావిత్రి ,  సిబ్బంది కలిసి నిందితులను పట్టుకున్నారు.    వారి నుంచి రూ. 17 లక్షల విలువైన 34 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌ ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌ లో అప్పగించారు.