రామచంద్రాపురం(పటాన్చెరు), వెలుగు: జాతీయ స్థాయిలో నిర్వహించిన స్మార్ట్ ఇండియా హ్యాకథాన్లో గీతం విద్యార్థులు ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచారు. గుజరాత్లోని అహ్మదాబాద్ నోడల్ సెంటర్లో ఇటీవల జరిగిన ఎస్ఐహెచ్–2025లో గీతం బీటెక్ సీఎస్ఈ, ఏఐఎంల్ఎల్సెకండియర్విద్యార్థులు కె.కృష్ణప్రియ, అబ్దుల్ బాసిత్ హసన్, కె.అమోఘ్, యశ్వంత్, యక్త చావలి, శరణ్య మదీనా ప్రభుత్వ ఈ–కన్సల్టేషన్ మాడ్యూల్లో ఏఐ ఆధారిత వేదికను అభివృద్ధి చేసి విజయవంతంగా ప్రదర్శించారు.
వారికి ఎస్ఐహెచ్జ్యూరీ రూ.1.5 లక్షల ప్రైజ్మనీ అందించి సత్కరించింది. ఈ సందర్భంగా బుధవారం విద్యార్థులను వీసీ డీఎస్.రావు, రెసిడెంట్ డైరెక్టర్డీవీవీఎస్ఆర్.వర్మ, సీఎస్ఈ, ఏఐఎంఎల్ విభాగాధిపతులు, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్, స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్ అభినందించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ముసాయిదా చట్టాలు, నిబంధనలపై పౌరుల అభిప్రాయాలను సమర్థంగా విశ్లేషించవచ్చని ప్రాజెక్టు మెంటార్చంద్రశేఖర్తెలిపారు.

