‘గీతం’లో సీఆర్​పీఎఫ్​ మహిళా బైక్​ రైడర్స్​ ట్రూప్​కు గ్రాండ్ వెల్​కమ్

‘గీతం’లో సీఆర్​పీఎఫ్​ మహిళా బైక్​ రైడర్స్​ ట్రూప్​కు గ్రాండ్ వెల్​కమ్

రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు:  ‘యశస్వినీ ఆల్​ ఉమెన్​ మోటార్​సైకిల్ ఎక్స్​పెడిషన్- 2023’ పేరిట సీఆర్​పీఎఫ్ మహిళా అధికారులు నిర్వహిస్తున్న రైడర్​ ట్రూప్​కు గీతం డీమ్డ్​ యూనివర్శిటీ బుధవారం గ్రాండ్ వెల్​కమ్​ పలికింది. సీఆర్​పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ సుమ నేతృత్వంలో 60 మంది సభ్యుల బృందం కన్యాకుమారి నుంచి బైక్​ యాత్ర ఆరంభించి గుజరాత్​లోని ఏక్తానగర్​కు చేరుకోనున్నారు.

ఏకకాలంలో శ్రీనగర్​, షిల్లాంగ్​, కన్యకుమారి నుంచి అక్టోబర్​ 5న ప్రారంభమైన మూడు బృందాలు 15 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల గుండా దాదాపు 15 వేల కిలోమీటర్లు ప్రయాణించి నెలాఖరుకు ఏక్తానగర్ చేరుకోనున్నాయి. మార్గ మధ్యలో కన్యాకుమారి ట్రూప్​ను బుధవారం గీతం ఆధ్వర్యంలో స్వాగతించి ఆతిథ్యం అందించారు.

జిల్లా అడిషనల్​ కలెక్టర్ చంద్రశేఖర్, సీఆర్​పీఎఫ్ డీఐజీ అనిల్ మింజ్, కమాండెంట్ ఉత్పల్​ మోని బెశ్యై, అసిస్టెంట్ కమాండెంట్ కిషోర్, గీతం రెసిడెంట్ డైరెక్టర్​ డీవీవీఎస్​ఆర్​ వర్మ బైక్​ రైడర్లకు స్వాగతం పలికారు.‘ బేటీ బచావో- బేటీ పడావో’, ‘నారీ శక్తి’ సందేశాలను వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో ఈ యాత్రను చేపట్టినట్లు మహిళా రైడర్లు తెలిపారు.