
- సింగూరు నుంచి 20వేల క్యూసెక్కుల నీరు విడుదల
పాపన్నపేట, వెలుగు: సింగూరు నుంచి 20,265 క్యూసెక్కుల నీటిని దిగువకు వదలడంతో ఘనపురం ఆనకట్ట పొంగిపొర్లుతోంది. దుర్గమ్మ ఆలయం జల దిగ్బంధంలో చిక్కుకుంది. శుక్రవారం ఏడుపాయల్లో పరిస్థితిని సమీక్షించడానికి వచ్చిన కలెక్టర్ రాహుల్రాజ్ఇరిగేషన్, పోలీసు, ఆలయ అధికారులతో మాట్లాడారు. మంజీర వరద ఉధృతిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తుండాలని సూచించారు. భక్తులెవరూ మంజీర నది వైపు వెళ్లకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గజ ఈతగాళ్లు అందుబాటులో ఉండాలన్నారు. కలెక్టర్వెంట ఇరిగేషన్ అధికారులు, ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్, పోలీసులు, ఆలయ సిబ్బంది ఉన్నారు.
దుర్గమ్మను దర్శించుకున్న జిల్లా జడ్జి
జిల్లా న్యాయమూర్తి నీలిమ కుటుంబ సభ్యులతో కలసి దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, సిబ్బంది ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు. రాజగోపురంలో ఏర్పాటు చేసిన ఉత్సవ విగ్రహానికి పూజలు చేశారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి, శాలువాతో సత్కరించారు.