కరోనా బారినపడి మరో మాజీ ఎంపీ మృతిచెందారు. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సురేంద్ర ప్రకాష్ గోయల్ కరోనా సోకి చనిపోయారు. కరోనాతో బాధపడుతున్న ఆయన కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే శుక్రవారం ఉదయం ఆయన ఆరోగ్యం విషమించడంతో కన్నుమూశారు. ఆయనకు భార్య, ఒక కొడుకు, కుమార్తే ఉన్నారు. గోయల్ మృతిపట్ల రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ సంతాపం తెలిపారు. ‘ఘజియాబాద్కు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన సురేంద్ర ప్రకాష్ గోయల్ కరోనాతో కన్నుమూసినట్లు తెలిసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలి’ అని వీకే సింగ్ ట్వీట్ చేశారు.
For More News..