![న్యూయార్క్ మేయర్తో భేటీ](https://static.v6velugu.com/uploads/2023/02/GHMC-Mayor_zESandG8m5.jpg)
హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ‘గుడ్ విల్’ కార్యక్రమంలో భాగంగా యూఎస్లోని న్యూయార్క్ సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్తో మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎరిక్ ఆడమ్స్ మాట్లాడుతూ హైదరాబాద్ రోజురోజుకు గ్లోబల్ సిటీగా డెవలప్ అవుతూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతోందన్నారు. గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. సిస్టర్ సిటీ రిలేషన్ షిప్ ద్వారా అభివృద్ధి చెందిన సిటీలతో పరస్పర సహకారం, బిజినెస్లో అవకాశాలను పెంపొందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. గతంలో కాలిఫోర్నియా సిటీతో సిస్టర్ సిటీ రిలేషన్షిప్ ఎంఓయూ కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఏప్రిల్30 లోపు హైదరాబాద్కు వచ్చి సిటీని సందర్శించాలని ఆడమ్స్ను కోరారు. అభివృద్ధి పరిశీలించి టెక్నాలజీ, ఇతర ఒప్పందాలు చేసుకోవాలన్నారు.