రాయసముద్రం చెరువును సందరీకరిస్తాం : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

రాయసముద్రం చెరువును సందరీకరిస్తాం : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
  •     హైడ్రా కమిషనర్​ ఏవీ రంగనాథ్

రామచంద్రాపురం, వెలుగు: జీహెచ్ఎంసీ పరిధిలోని రామచంద్రాపురం రాయసముద్రం చెరువును సుందరీకరిస్తామని హైడ్రా కమిషనర్​ ఏవీ రంగనాథ్​ తెలిపారు. ఈ విషయమై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని పేర్కొన్నారు. మంగళవారం రాయసముద్రం చెరువును, అలుగులు, ఇన్​లెట్, ఔట్​లెట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. బీహెచ్​ఈఎల్​ ఏజీఎం సురన్​ప్రసాద్, హెచ్​ఎండీఏ, సంబంధిత శాఖల అధికారులతో అక్కడే మాట్లాడి పలు ఆదేశాలు జారీ చేశారు. 

అనంతరం మాట్లాడుతూ.. రెవెన్యూ పరంగా చెరువు బీహెచ్​ఈఎల్​ పరిధిలో ఉన్నా కమ్యూనల్​ ప్రాపర్టీగా పరిగణించాలన్నారు. ప్రజల వినియోగానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చేసి హెచ్ఎండీఏకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. 

చెరువులోకి వస్తున్న మురుగు నీటిని దారి మళ్లించేందుకు బీహెచ్​ఈఎల్​తో చర్చలు జరిపి ప్రత్యేక పైప్​ లైన్లు వేస్తామన్నారు. వలస పక్షులకు కూడా నిలయంగా మారిన ఈ చెరువును పూర్తి స్థాయిలో కాపాడుకోవాలని కోరారు. తెల్లాపూర్​ మేళ్ల చెరువు ఎఫ్టీఎల్, బఫర్​ జోన్​లో మట్టిని నింపిన ఫిర్యాదుపై స్పందించిన రంగనాథ్ వెంటనే అక్కడ మట్టిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. రాజు యాదవ్​ అనే వ్యక్తి ఇప్పటికైనా స్పందించకపోతే క్రిమినల్​ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.