స్కూల్ బస్సులు, భారీ వాహనాల్లో కూడా సీటు బెల్ట్ వినియోగాన్ని తప్పనిసరి చేయాలని కోరుతూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖను అంతర్జాతీయ రహదారి సమాఖ్య (IRF) లేఖ రాసింది. ఇది రోడ్డు ప్రమాదాలు తగ్గడానికి కారణమవుతాయని లేఖలో తెలిపింది. బస్సు ప్రమాదాల వల్ల చాలా మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.
సీటు బెల్ట్ పెట్టుకుంటే ప్రమాదం నుంచి బయటపడతారని సూచించింది. సీటు బెల్ట్ వినియోగాన్ని తప్పనిసరి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర రవాణాశాఖకు రాసిన లేఖలో ఐఆర్ఎఫ్ ప్రెసిడెంట్ కపిల కోరారు. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ 2021 డేటా ప్రకారం, అమెరికాలో బస్సు ప్రమాదాల్లో 14 మంది మాత్రమే ప్రాణాలు కోల్పోయారు.
చైనా (2022)లో బస్సు ప్రమాదాల్లో 215 మరణించారు. భారత్లో బస్సుల్లో ఈతరహా ప్రమాణాలను సరిగ్గా పాటించకపోవడంతో పాఠశాలకు వెళ్లే పిల్లలు, అమాయకుల జీవితాలు ప్రమాదంలో పడుతున్నాయని ఐఆర్ఎఫ్ ప్రెసిడెంట్ కపిల ఆందోళన వ్యక్తంచేశారు.