
హైదరాబాద్, వెలుగు: సిటీలోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు (ఆర్జీఐఏ) ను మరో 30 ఏళ్లపాటు నిర్వహించడానికి జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్కు (జీహెచ్ఐఏల్) మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (ఎంఓసీఏ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2038 మార్చి 23 నుంచి 2068 మార్చి 22 వరకు జీహెచ్ఐఏల్ ఎయిర్పోర్టు నిర్వహణను చూస్తుంది. జీహెచ్ఐఏల్ జీఎంఆర్ ఇన్ఫ్రా లిమిటెడ్ (జీఐఎల్) కు సబ్సిడరీ. 2008 మార్చిలో మొదలైన ఆర్జీఐఏ, పబ్లిక్–ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో నడుస్తున్న మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ఎయిర్పోర్టు. ఏటా1.2 కోట్ల మంది ప్రయాణికుల నిర్వహణ సామర్థ్యంతో ఆర్జీఐఏ షురువైంది. వచ్చే పదేళ్లలో ఈ సంఖ్యను 10 కోట్లకు పెంచుతారు.