
కోల్బెల్ట్/ నస్పూర్, వెలుగు: మహారత్న కంపెనీలకు దీటుగా సింగరేణి నిలుస్తోందని మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాల జీఎంలు జి.దేవేందర్, ఎం.శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం తమ ఆఫీస్లలో స్వాతంత్ర వేడుకలు నిర్వహించారు. ఉత్తమ ఉద్యోగులను జీఎం దేవేందర్–స్వరూపరాణి, జీఎం శ్రీనివాస్–ఉమాదేవి దంపతులు సన్మానించారు. సింగరేణి హైస్కూల్స్ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. .
సింగరేణి కార్మిక వాడల్లో సంబురాలు
మందమర్రి, రామకృష్ణాపూర్ సింగరేణి కార్మిక వాడల్లో స్వాతంత్ర్య వేడుకలు సంబురంగా జరుపుకున్నారు. మందమర్రి మార్కెట్లో, రామకృష్ణాపూర్ సూపర్బజార్లో కాంగ్రెస్ ప్రెసిడెంట్లు నోముల ఉపేందర్గౌడ్, పల్లె రాజు, సొతుకు సుదర్శన్, పిన్నింటి రాఘునాథ్రెడ్డి, మందమర్రిలో సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ సెక్రటరీ సలెంద్ర సత్యనారాయణ జెండాలను ఆవిష్కరించారు.