ఎడిషన్‌‌ నేషనల్‌‌ గేమ్స్‌‌కు ఆతిథ్యం ఇవ్వనున్న గోవా

ఎడిషన్‌‌ నేషనల్‌‌ గేమ్స్‌‌కు ఆతిథ్యం ఇవ్వనున్న గోవా

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది అక్టోబర్‌‌‌‌లో జరిగే 37వ ఎడిషన్‌‌ నేషనల్‌‌ గేమ్స్‌‌కు గోవా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఇండియన్‌‌ ఒలింపిక్‌‌ అసోసియేషన్‌‌ (ఐఓఏ) శనివారం కన్ఫామ్‌‌ చేసింది. వచ్చే నేషనల్‌‌ గేమ్స్‌‌ను నిర్వహించేందుకు గోవా రాష్ట్ర ప్రభుత్వం ఐఓఏకి తన సూత్రప్రాయ ఆమోదాన్ని తెలియజేసింది.

దాంతో, వచ్చే ఎడిషన్​ను గోవాకు కేటాయిస్తున్నట్టు ఆ క్రీడా శాఖ సెక్రటరీకి ఐఓఏ లెటర్‌‌ రాసింది. సూరత్‌‌లో ఈ నెల 12వ తేదీన జరిగే  ప్రస్తుత నేషనల్‌‌ గేమ్స్‌‌ ముగింపు కార్యక్రమంలో ఐఓఏ జెండాను గోవా ప్రతినిధుల బృందానికి అందజేస్తామని చెప్పింది.  వచ్చే ఏడాది  చైనాలో జరిగే ఏషియన్‌‌ గేమ్స్‌‌ ను దృష్టిలో  ఉంచుకొని షెడ్యూల్‌‌ ఖరారు చేస్తామని తెలిపింది.