Gold Rate: ర్యాలీ ఆపని గోల్డ్, సిల్వర్.. మానవ చరిత్రలోనే గరిష్టాలకు రేట్లు.. హైదరాబాదులో తులం ఎంతంటే..?

Gold Rate: ర్యాలీ ఆపని గోల్డ్, సిల్వర్.. మానవ చరిత్రలోనే గరిష్టాలకు రేట్లు.. హైదరాబాదులో తులం ఎంతంటే..?

Gold Price Today: ధనత్రయోదశ, దీపావళి దగ్గరపడుతున్న కొద్ది బంగారం, వెండి రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మానవచరిత్రలో ఎన్నడూ కనివిని ఎరుగని రేట్లకు ఈ లోహాలు పెరిగిపోవటం సామాన్య మధ్యతరగతి భారతీయ కుటుంబాలను పండక్కి ఆందోళనకు గురిచేస్తున్నాయి. కేవలం ఏడాదిలోనే ఈ రెండు 60 శాతానికి పైగా పెరగటం.. భవిష్యత్తులోనూ తగ్గేలా కనిపించకపోవటంపై ప్రజల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి. పండక్కి షాపింగ్ చేయాలనుకుంటున్న వ్యక్తులు ముందుగా తెలుగు రాష్ట్రాల్లో రేట్లు తెలుసుకోవటం ముఖ్యం.. 

24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే అక్టోబర్ 14తో పోల్చితే 10 గ్రాములకు అక్టోబర్ 15న రూ.540 పెరిగింది. అంటే గ్రాముకు రేటు రూ.54 పెరగటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ రేట్లు భగ్గుమంటున్నాయి..

24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(అక్టోబర్ 15న):
హైదరాదాబాదులో రూ.12వేల 889
కరీంనగర్ లో రూ.12వేల 889
ఖమ్మంలో రూ.12వేల 889
నిజామాబాద్ లో రూ.12వేల 889
విజయవాడలో రూ.12వేల 889
కడపలో రూ.12వేల 889
విశాఖలో రూ.12వేల 889
నెల్లూరు రూ.12వేల 889
తిరుపతిలో రూ.12వేల 889

ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు అక్టోబర్ 14తో పోల్చితే ఇవాళ అంటే అక్టోబర్ 15న 10 గ్రాములకు రూ.500 పెరుగుదలను చూసింది. దీంతో బుధవారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. 

22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(అక్టోబర్ 15న):
హైదరాదాబాదులో రూ.11వేల 815
కరీంనగర్ లో రూ.11వేల 815
ఖమ్మంలో రూ.11వేల 815
నిజామాబాద్ లో రూ.11వేల 815
విజయవాడలో రూ.11వేల 815
కడపలో రూ.11వేల 815
విశాఖలో రూ.11వేల 815
నెల్లూరు రూ.11వేల 815
తిరుపతిలో రూ.11వేల 815

బంగారం రేట్లతో పాటు మరోపక్క వెండి కూడా తమ ర్యాలీని వారం ప్రారంభం నుంచి తగ్గేదేలే అన్నట్లుగా కొనసాగిస్తోంది. దీంతో అక్టోబర్ 15 కేజీకి వెండి అక్టోబర్ 14తో పోల్చితే రూ.వెయ్యి పెరగటంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.2లక్షల 07వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.207 వద్ద విక్రయాలున్నాయి.