హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిని గురువారం ఆయన నివాసంలో గూగుల్ వైస్ ప్రెసిడెంట్ తోట చంద్రశేఖర్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులపై చంద్రశేఖర్ సీఎంతో చర్చించి ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేసారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తున్నదని, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి అంశాలలో తెలంగాణ కోసం డిజిటలైజేషన్ ఎజెండాను అభివృద్ధి చేయడంలో భాగస్వాములు కావడంపై సీఎంకు వివరించారు.
తెలంగాణ పౌరుల అవసరాలను తీర్చడానికి నాణ్యమైన సేవలను అందించడానికి విస్తృత సాంకేతికత, నైపుణ్యం తమతో ఉందని సీఎంకు వివరించారు. గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ ప్లాట్ఫామ్ల సాయంలో రోడ్డు సేఫ్టీ కల్పించడంపై కూడా సీఎం చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు డి.శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.