హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టెన్త్ క్లాస్ బోర్డు ఎగ్జామ్స్ పేపర్లు, సిలబస్ పై సర్కారు క్లారిటీ ఇచ్చింది. నిరుటి లెక్కనే ఈసారీ ఆరు పేపర్లే ఉంటాయని, 70 శాతం సిలబస్నే ఎగ్జామ్స్ లో పరిగణనలోకి తీసుకుంటామని ప్రకటించింది. ఈ మేరకు సోమవారం విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వేర్వేరుగా ఉత్తర్వులిచ్చారు. టెన్త్ ఎగ్జామ్స్, సిలబస్పై సర్కారు సప్పుడు చేయక పోవడంతో ‘‘టెన్త్ సిలబస్ ఎంత? పేపర్లు ఎన్ని?’’ హెడ్డింగ్తో ఆదివారం ‘వెలుగు’ కథనం ప్రచురించింది. అకడమిక్ప్రారంభమై మూడున్నర నెలలైనా టెన్త్ ఎగ్జామ్స్, సిలబస్పై సర్కారు స్పష్టతనివ్వకపోవడంతో స్టూడెంట్లు, టీచర్ల ఆందోళన చెందుతున్నారని ‘వెలుగు’ కథనంతో సర్కారులో చలనం వచ్చింది. వెంటనే స్పందించిన ప్రభుత్వం 2020–21లో కొనసాగించిన విధానాన్నే 2021–22 అకడమిక్ ఇయర్లోనూ అమలు చేస్తామని ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఈ ఏడాది కూడా 11 పేపర్లకు బదులు ఆరు పేపర్లతోనే ఎగ్జామ్స్నిర్వహించనున్నారు.
80 మార్కుల పేపర్...
టెన్త్లో హిందీ మినహా మిగిలిన అన్ని ఐదు సబ్జెక్టులకు రెండేసి చొప్పున మొత్తం11 పేపర్లు ఉండేవి. నిరుడు కరోనా నేపథ్యంలో సబ్జెక్ట్కు ఓ పేపర్ చొప్పున ఆరుకు కుదించారు. అయితే కరోనా ఎఫెక్ట్తో ఎగ్జామ్స్ జరగలేదు. ఈ ఏడాది కూడా కరోనా పూర్తిగా తగ్గకపోవడంతో ఆరు పేపర్లే కొనసాగించాలని సర్కారు నిర్ణయించింది. దీంతో 80 మార్కుల పేపర్ కు 3.15 గంటల డ్యురేషన్తో ఎగ్జామ్ ఉండనుంది. మిగతా 20 ఇంటర్నల్ మార్కులుంటాయి. వందశాతం సిలబస్ను స్టూడెంట్లకు బోధించాల్సి ఉన్నా, ఎగ్జామ్స్లో మాత్రం 70 శాతం పాఠాలనే పరిగణనలోకి తీసుకుంటారు. మిగిలిన అన్ని క్లాసులకూ ఎగ్జామ్స్లో 70 శాతం సిలబస్నే తీసుకుంటారు.
ఫస్ట్ వీక్లో ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్..
ఎగ్జామ్స్పై క్లారిటీ రావడంతో ఫీజు షెడ్యూల్ రిలీజ్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నవంబర్ ఫస్ట్ వీక్నుంచి డిసెంబర్ వరకు ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎగ్జామ్ ఫీజు పెంచబోమని ఎగ్జామ్స్ విభాగం డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. కాగా టెన్త్బోర్డ్ ఎగ్జామ్స్మార్చి‑ఏప్రిల్నెలలో ఉంటాయని విద్యాశాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.