బేసిక్​ కెమికల్స్​ కోసం పీఎల్​ఐ తెస్తాం..

బేసిక్​ కెమికల్స్​ కోసం పీఎల్​ఐ తెస్తాం..

 

  •     కెమికల్స్, ఫెర్టిలైజర్స్​ మంత్రి మన్​సుఖ్​​ మాండవీయ

న్యూఢిల్లీ: బేసిక్​ కెమికల్స్​ కోసం ప్రొడక్ట్​ లింక్డ్​ ఇన్సెంటివ్​ (పీఎల్​ఐ) స్కీము తేవడానికి ప్లాన్​ చేస్తున్నట్లు కెమికల్స్​ అండ్​ ఫెర్టిలైజర్స్​ మంత్రి మన్​సుఖ్​​ మాండవీయ వెల్లడించారు. అందుబాటు ధరలలో క్వాలిటీ ఫార్మా–మెడికల్​ డివైసెస్​ తయారు చేయాలని మాన్యుఫాక్చరింగ్​ పరిశ్రమను మంత్రి కోరారు. ఫార్మా అండ్​ మెడికల్​ డివైసెస్​ సెక్టార్​పై జరిగిన ఇంటర్నేషనల్​ కాన్ఫరెన్స్​లో శుక్రవారం మంత్రి ​ మాండవీయ మాట్లాడారు. మోడీ ప్రభుత్వం పేదలకు, రైతులకు మాత్రమే కాకుండా పరిశ్రమకూ స్నేహపూర్వకమైనదేనని పేర్కొన్నారు. ఇండస్ట్రీ ప్రతినిధులు, స్టేక్​హోల్డర్లందరితో చర్చించాకే పాలసీలకు రూపకల్పన చేస్తున్నట్లు చెప్పారు. ఫార్మసీ ఆఫ్​ వరల్డ్​గా ఇండియా పేరొందిందని చెబుతూ, రీసెర్చ్​–ఇన్నొవేషన్స్​పై పరిశ్రమ ఫోకస్​ పెట్టాలని మంత్రి సూచించారు. ఇలా చేయడం ద్వారా మన దేశానికి ఉన్న లీడర్షిప్​ పొజిషన్​ను కొనసాగించుకోవచ్చని అన్నారు. గ్లోబల్​మార్కెట్లో పోటీ తట్టుకునేందుకు మన దేశంలోని పరిశ్రమ రెడీగా ఉండాలని పేర్కొన్నారు. క్వాలిటీ ప్రొడక్టులను అందుబాటు ధరలలో తేవడం చాలా ముఖ్యమైనదని వివరించారు. క్వాలిటీ విషయంలో రాజీ పడొద్దని, ప్రభుత్వం కూడా క్వాలిటీ పరమైన తప్పులను సహించబోదని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఫార్మా, మెడికల్​ డివైసెస్​ సెక్టార్లలో క్వాలిటీ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చొరవకు మద్దతు ఇవ్వాల్సిందిగా పరిశ్రమ వర్గాలను కోరారు. క్వాలిటీ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే గ్లోబల్​ కాంపిటీషన్​లో మనం వెనకబడాల్సి వస్తుందని చెప్పారు. డొమెస్టిక్​ ప్రొడక్షన్ ​పెంచేందుకు ఇప్పటికే పీఎల్​ఐ 1, పీఎల్​ఐ 2 స్కీములను ఈ సెక్టార్లో తీసుకొచ్చామని చెబుతూ, రాబోయే రోజులలో బేసిక్​ కెమికల్స్​ కోసమూ మరో పీఎల్​ఐ స్కీమును తేనున్నామని వెల్లడించారు. ఆగ్రో–కెమికల్స్​, పెట్రో–కెమికల్స్, ఫార్మా ఏపీఐ పరిశ్రమ రంగాలకు  బేసిక్​ కెమికల్స్​చాలా అవసరమని పేర్కొన్నారు.