
- పీయూలో 77 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందించిన వర్సిటీ చాన్స్లర్, గవర్నర్ జిష్ణుదేవ్వర్మ
మహబూబ్నగర్ రూరల్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీ స్నాతకోత్సవం గురువారం సంబురంగా సాగింది. చీఫ్గెస్ట్గా హాజరైన వర్సిటీ చాన్స్లర్, గవర్నర్జిష్ణుదేవ్వర్మ.. ముందుగా పాలమూరు జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త మన్నె సత్యానారాయణ రెడ్డికి గౌరవ డాక్టరేట్ప్రదానం చేశారు. అనంతరం మైక్రో బయాలజీ, కెమిస్ట్రీ, కామర్స్, బిజినెస్ మేనేజ్మెంట్లో పీహెచ్డీ చేసిన 12 మందికి పట్టాలు అందజేశారు.
తర్వాత 2020, 2021, 2022లో పీజీ కోర్సులైన ఇంగ్లిష్, ఎకనామిక్స్, హిస్టరీ, సోషల్ వర్క్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్సైన్స్, ఎంకాం, ఎంబీఏ, బొటనీ, కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, ఫిజిక్స్, మ్యాథ్స్, జువాలజీ, ఎంసీఏ, ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్, ఇంటిగ్రేడెట్కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్సైన్స్, ప్రొఫెషన్ కోర్సులైన బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ, ఫార్మా డీ, ఎంఈడీ, బీఈడీ, బీపీఈడీ, అండర్ గ్రాడ్యుయేషన్(యూజీ)లో బీఏ, బీకాం, బీఎస్సీ, పీబీఏలో అత్యధిక మార్కులు సాధించిన 83 మంది స్టూడెంట్లకు గానూ 77 మందికి వీసీ జీఎన్.శ్రీనివాస్తో కలిసి గోల్డ్ మెడల్స్అందించారు. మిగతా వారు వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేదు.
వారికి వీసీ చేతులమీదుగా త్వరలో పతకాలు అందించనున్నారు. వక్తల ప్రసంగం అనంతరం గవర్నర్, మన్నె సత్యనారాయణ రెడ్డిని వర్సిటీ సిబ్బంది శాలువాలతో సత్కరించి, మెమొంటోలు అందజేశారు. కాన్వొకేషన్ ముగిసిన అనంతరం పీహెచ్డీ పట్టాలు, గోల్డ్ మెడల్స్ సాధించిన స్టూడెంట్లు తమ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్లో కలిసి ఫొటో సెషన్లో పాల్గొన్నారు.
కార్యక్రమం సాగిందిలా..
షెడ్యూల్ ప్రకారం.. గవర్నర్ జిష్ణుదేవ్వర్మ హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన బయల్దేరి ఉదయం 10.57 గంటలకు వర్సిటీ వద్దకు చేరుకున్నారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అక్కడి నుంచి 11.02 గంటలకు వర్సిటీ సెంట్రల్ లైబ్రరీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కాన్వొకేషన్కు హాజరయ్యారు. 11.03 గంటలకు జాతీయ గీతాన్ని ఆలపించి, 11.05 గంటలకు ముగించారు. 11.05 గంటలకు కాన్వొకేషన్ ప్రారంభమైంది. మొదట ఎంఎస్ఎన్ గ్రూప్ఆఫ్కంపెనీస్ ఫౌండర్, ఎండీ మన్నె సత్యనారాయణ రెడ్డి మాట్లాడారు. అనంతరం వర్సిటీ అభివృద్ధిపై వీసీ మాట్లాడారు. మధ్యాహ్నం 12.04 నిమిషాలకు గవర్నర్ ప్రసంగం ప్రారంభించి, 8 నిమిషాలు మాట్లాడారు. అనంతరం జాతీయ గీతాలాపన తర్వాత స్నాతకోత్సవాన్ని ముగించారు.
సేంద్రియ వ్యవసాయంపై పరిశోధనలు చేస్తా..
మాది నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం నర్సంపల్లి. నాన్న చిన్నయ్య గౌడ్ రైతు. డిగ్రీ జడ్చర్ల బీఆర్ఆర్కాలేజీలో పూర్తి చేశా. ప్రస్తుతం పాలమూరు వర్సిటీలో మైక్రో బయాలజీలో పీహెచ్డీ పూర్తి చేసి పట్టా అందుకోవడం సంతోషంగా ఉంది. సేంద్రియ వ్యవసాయంపై పరిశోధనలు చేయడమే నా జీవిత ఆశయం. - విజయ్కుమార్, పీహెచ్డీ పట్టాదారు
నోట్స్ ప్రిపేర్ చేసుకున్న..
మాది మహబూబాబాద్జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం తండా. అమ్మ సుజాత, నాన్న రవి వ్యవసాయం చేస్తుంటారు. జనగామ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కాలేజీలో డిగ్రీ చదువుతుండగా.. లెక్చరర్లు ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ చేయమని చెప్పారు. యూట్యూబ్లో చూసి నోట్స్ప్రిపేర్ చేసుకున్న. గ్రూప్–1 జాబ్ సాధించడమే నా గోల్.- బానోతు శిరీష, గోల్డ్ మెడలిస్ట్
నాకు చదువంటే ఆసక్తి
మా ఆయన డాక్టర్. నాకు ఇంజనీరింగ్ చదువుతున్న కొడుకు ఉన్నాడు. చదువంటే ఇష్టం. నా భర్త ప్రోత్సాహంతో కామర్స్లో పీహెచ్డీ చేశా. హైదరాబాద్లోని హిమాయత్ నగర్లో ఉన్న ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజ్లో అసోసియేట్ ప్రొఫెసర్గా పని చేస్తున్న. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పీహెచ్డీ పూర్తి చేశా.- రితిక బజాజ్, పీహెచ్డీ పట్టాదారు