వాళ్ల పోరాటాలతోనే తెలంగాణ సిద్ధించింది

వాళ్ల పోరాటాలతోనే తెలంగాణ సిద్ధించింది

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఏడాదికి తెలంగాణకి స్వాతంత్ర్యం వచ్చిందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్‌ అన్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజలు వీరోచిత పోరాటం చేశారని తమిళిసై వెల్లడించారు. 1948 ఆగస్ట్ 28వ తేదీ తెలంగాణకి చాలా ముఖ్యమైన రోజని పేర్కొన్నారు. వీర బైరాన్పల్లి వీరుల త్యాగాలు, పోరాటాలను ప్రభుత్వం గుర్తించడం లేదని, ఇప్పటికైనా వారిని గుర్తించాలని తమిళిసై డిమాండ్ చేశారు. వాళ్లు చేసినా పోరాటాల వల్లే తెలంగాణ సిద్ధించిందని గవర్నర్ తెలిపారు. హైదరాబాద్ లిబరేషన్ డే సందర్భంగా నిర్వహించిన పోటీల్లో స్టేట్ వైడ్ గా విద్యార్థుల నుంచి మంచి స్పందన వచ్చిందని తమిళిసై వెల్లడించారు. బహుమతులు గెలుచుకోవడం ముఖ్యం కాదని, అందులో పార్టిసిపేట్ చేయడం ముఖ్యమని అన్నారు.