
న్యూఢిల్లీ: ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం 40% రిస్క్ అలవెన్స్ ప్రకటించింది. వారు చేసే కఠినమైన విధులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్లోని 21,625 ఫీట్ల ఎత్తైన మణిరంగ్ పర్వతం కొలతలు విజయవంతం గా సేకరించిన 35 మందితో కూడిన ఎన్డీఆర్ ఎఫ్ టీమ్కు స్వాగతం చెప్తూ శనివారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
“చాలాకాలంగా పెండింగ్లో ఉన్న.. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి 40% రిస్క్ అలవెన్స్ ఇవ్వాలనే డిమాండ్ను కేంద్రం శుక్రవారం ఆమోదించింది. దీంతో ఈ ఫోర్స్ లోని 16 వేల మంది సిబ్బందికి ప్రయోజనం చేకూరుతుంది” అని షా అన్నారు. విపత్తుల సమయంలో ‘‘జీరో క్యాజువాలిటీ’’ విధానాన్ని అనుసరించాలని, ప్రాణనష్టం జరగకుండా చూసుకోవాలని సూచించారు. ప్రత్యేక దళాల్లో స్పోర్ట్స్ను ఒక కల్చర్గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపా రు. నేషనల్, ఇంటర్నేషనల్ టోర్నమెంట్లలో ఈ దళాల నుంచి ఒక టీమ్ పార్టిసిపేట్ చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.