న్యూఢిల్లీ: క్రయోజెనిక్ ట్యాంక్ తయారీ సంస్థ ఐనాక్స్ ఇండియా, లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ స్టాన్లీ ఐపీఓల ద్వారా నిధులను సేకరించేందుకు క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబరులో ఐపీఓ డాక్యుమెంట్లను ఇచ్చిన ఈ రెండు కంపెనీలు నవంబర్ 29-–30 మధ్య అబ్జర్వేషన్ లెటర్లు పొందాయని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) మంగళవారం వెల్లడించింది. డ్రాఫ్ట్ పేపర్ల ప్రకారం, ఐనాక్స్ ఇండియా ఐపీఓ పూర్తిగా ఓఎఫ్ఎస్ ఇష్యూ. దీని ప్రస్తుత వాటాదారులు, ప్రమోటర్ల ద్వారా 2.21 కోట్ల షేర్ల వరకు అమ్మకానికి ఉంచుతారు.
వడోదరకు చెందిన ఈ కంపెనీ ఐపీఓ ద్వారా ఆదాయాన్ని పొందదు. మొత్తం నిధులన్నీ వాటాదారులకు వెళ్తాయి. ఐనాక్స్ ఇండియా, డిజైన్, ఇంజినీరింగ్, తయారీ క్రయోజెనిక్ పరిస్థితుల కోసం పరికరాలు సిస్టమ్ల ఇన్స్టాలేషన్లో పరిష్కారాలను అందించడంలో 30 సంవత్సరాల అనుభవాన్ని సంపాదించింది. స్టాన్లీ లైఫ్స్టైల్స్ ఐపీఓలో ప్రెష్ఇష్యూ, ఓఎఫ్ఎస్ ఉంటాయి. ప్రమోటర్లు, ఇన్వెస్టర్, ఇతర వాటాదారులు రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను అమ్ముతారు. తాజా ఇష్యూ ద్వారా వచ్చిన ఆదాయాన్ని కొత్త స్టోర్లను తెరవడానికి, ఇప్పటికే ఉన్న స్టోర్ల పునరుద్ధరణకు వినియోగిస్తారు.