- జనవరి ఒక్క నెలలో ఇన్కం రూ.1.19 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: జీఎస్టీ వసూళ్లు ఎన్నడూ లేనంతగా పెరిగాయి. గత నెల జీఎస్టీ వసూళ్ల ద్వారా రూ.1.19 లక్షల కోట్లు సమకూరాయి. జీఎస్టీ విధానాన్ని అమలు చేసిన తరువాత ఇంత ఆదాయం రావడం ఇదే మొదటిసారి. ఇందులో సీజీఎస్టీ రూ.21,923 కోట్లు కాగా, ఎస్జీఎస్టీ రూ. 29,014 కోట్లు, ఐజీఎస్టీ రూ. 60,288 కోట్లు ఉంది. గత నెల 31 వరకు 90 లక్షల జీఎస్టీఆర్–3బీ రిటర్నులు ఫైల్ అయ్యాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సీజీఎస్టీ రూపంలో రూ. 46,454 కోట్లు, ఎస్జీఎస్టీగా రూ. 48,385 కోట్లు సమకూరాయి. జీఎస్టీ వసూళ్లు గత ఐదు నెలలుగా పెరుగుతున్నాయని కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ ప్రకటించింది. 2020 జనవరి వసూళ్లతో పోలిస్తే 2021 జీఎస్టీ వసూళ్లు ఎనిమిది శాతం ఎక్కువని వెల్లడించింది. 2020 డిసెంబరులోనూ రూ.1.15 లక్షల కోట్లు జీఎస్టీ రూపంలో సమకూరాయని పేర్కొంది.