
ఇటీవల కాలంలో హాట్ టాపిక్.. వీధికుక్కల దాడి..వీధికుక్కల దాడులు తీవ్రతరం కావడంతో ఈ సమస్యను ఎలా డీల్ చేయాలని అని ప్రభుత్వాలు, అధికారులు తలలు పట్టుకుంటున్న విషయం తెలిసిందే..ఈవిషయం సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్లింది. దాడుల్లో తీవ్రగాయాలతో కొందరు మరణిస్తే.. మరోవైపు కుక్కకాటుతో రేబిస్ వ్యాధి సోకి మరణాలు కూడా పెరుగుతున్నాయి. సొంత పెంపుడు కుక్క కరిచి ఓ పోలీసు అధికారి మరణించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
అహ్మదాబాద్కు చెందిన వనరాజ్ మంజరియాను అనే పోలీస్ ఇన్స్పెక్టర్ తన పెంపుడు కుక్క గీకడంతో రేబిస్ బారిన పడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. అహ్మదాబాద్ సిటీ పోలీస్ కంట్రోల్ రూమ్కు పోలీస్ ఇన్ స్పెక్టర్గా పనిచేస్తున్న మంజరియా.. కుక్క కరిచిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. కుక్క గీకింది కదా అని నిర్లక్ష్యం చేశాడు.. దీంతో అనారోగ్యం బారిన పడి ఆస్పత్రిలో చేరాడు.. టెస్టులు చేసిన డాక్టర్లు.. మంజరియాకు రేబిస్ సోకిందని చెప్పారు. అయితే రేబిస్ ముదరడంతో చికిత్స పొందుతూ అతను చనిపోయినట్లు నిర్ధారించారు.
చాలామంది కుక్క గీకితే రేబిస్ వ్యాధి సోకదు అని అంటుంటున్నారు.. కుక్క కరిచినా, గీకినా రేబిస్ సోకుతుందని, నిర్లక్ష్యం చేస్తే మరణం తప్పదని అంటున్నారు డాక్టర్లు.
►ALSO READ | అలా ఎలా ఎక్కావురా.. విమానం ల్యాండింగ్ గేర్లో దాక్కున్న ఆఫ్ఘన్ బాలుడు.. 2 గంటలు గాల్లోనే..