GT vs PBKS : దంచేసిన గిల్.. పంజాబ్ టార్గెట్ 200 పరుగులు

GT vs PBKS  :   దంచేసిన గిల్..  పంజాబ్ టార్గెట్ 200 పరుగులు

అహ్మదాబాద్‌ వేదికగా పంజాబ్ తో జరుగుతున్న  మ్యాచులో గుజరాత్ టైటాన్స్ జట్టు భారీ స్కోర్ చేసింది.  నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.  హర్షల్ పటేల్ వేసిన 19 ఓవర్‌లో 20 పరుగులు వచ్చాయి. ఓపెనర్ గా వచ్చిన శుభ్‌మన్ గిల్  చివరి బంతి వరకూ క్రీజులో ఉన్నాడు. 48 బంతుల్లో 89 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 4 సిక్స్ లు ఉన్నాయి.

సాయి సుదర్శన్ 33, విలియమ్సన్ 26 దూకుడుగా ఆడారు.  చివర్లో  రాహుల్ తెవాటియా (23) మెరుపులు మెరిపించాడు. వృద్ధిమాన్‌ సాహా (11), విజయ్ శంకర్‌ (8) నిరాశపరిచారు.  పంజాబ్‌ బౌలర్లలో కగిసో రబాడ 2, హర్‌ప్రీత్‌ బ్రార్‌, హర్షల్ పటేల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.  విజయం కోసం పంజాబ్ 200 పరుగులు చేయాల్సి ఉంది.