- ఇక్కడ బలమైన ఎకోసిస్టమ్
- టాప్ పర్ఫార్మర్స్ లిస్టులో తెలంగాణ
- వెల్లడించిన డీపీఐఐటీ
న్యూఢిల్లీ: ఎంట్రప్రిన్యూర్ల కోసం బలమైన స్టార్టప్ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేయడంలో గుజరాత్, కర్నాటకలు ముందున్నాయి. బెస్ట్పర్ఫార్మర్స్గా ర్యాంకులను తెచ్చుకున్నాయి. ఇదే లిస్టులో కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ కూడా ఉన్నాయి. ఇవి స్టార్టప్ల కోసం అత్యుత్తమ విధానాలను తీసుకొచ్చాయి. స్టార్టప్ వృద్ధికి అనుకూలమైన ఎకోసిస్టమ్ను నిర్మించడానికి 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చేస్తున్న ప్రయత్నాలను పరిశీలించిన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) ఐదు రకాల ర్యాంకులను ఇచ్చింది.
ఇందులో బెస్ట్ పర్ఫార్మర్స్, టాప్ పర్ఫార్మర్స్, లీడర్స్, ఆస్పైరింగ్ లీడర్స్, ఎమర్జింగ్స్టార్టప్ ఎకోసిస్టమ్లు ఉన్నాయి. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను వాటి జనాభా ఆధారంగా రెండు విభాగాలుగా విభజించారు. కోటి కంటే ఎక్కువ ఉన్నవి, కోటి కంటే తక్కువ ఉన్నవిగా వర్గీకరించారు. గుజరాత్ వరుసగా నాలుగోసారి బెస్ట్ స్టేట్గా నిలిచింది. కర్ణాటక వరుసగా రెండో ఏడాది ర్యాంకు సాధించింది. మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయలు ‘టాప్ పర్ఫార్మర్స్’గా ఎంపికయ్యాయి. ఎనిమిది రాష్ట్రాలను 'లీడర్స్' కేటగిరీలో చేర్చారు.
ఇందులో ఆంధ్రప్రదేశ్, అస్సాం, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, త్రిపుర ఉన్నాయి. బిహార్, హర్యానా, అండమాన్ నికోబార్ దీవులు, నాగాలాండ్ వంటి రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు 'ఆస్పైరింగ్లీడర్స్' విభాగంలో ఉన్నాయి. ఛత్తీస్గఢ్, ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూ, లడఖ్, మిజోరాం, పుదుచ్చేరి సిక్కింలు 'ఎమర్జింగ్ స్టార్టప్ ఎకోసిస్టమ్స్' విభాగంలోకి వచ్చాయి.
యాక్షన్ పాయింట్ల ఆధారంగా..
ఇన్నోవేషన్లను ప్రోత్సహించడం, మార్కెట్కు యాక్సెస్, ఇంక్యుబేషన్ ఫండింగ్ సపోర్ట్ వంటి 25 యాక్షన్ పాయింట్ల ఆధారంగా ఈ ర్యాంకులను ఇచ్చామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన స్టార్టప్లకు ఎలాంటి సాయం అవసరమో తెలుసు కోవాలని అధికారులను ఆయన కోరారు. స్టార్టప్లు పేటెంట్లు, ట్రేడ్మార్క్ల వంటి ఇంటెలెక్చువల్ప్రాపర్టీ రైట్స్ (ఐపిఆర్లు) నమోదు కోసం డీపీఐఐటీ సాయం తీసుకోవాలని అన్నారు. దాదాపు 1,800 గుర్తింపు పొందిన స్టార్టప్లకు పేటెంట్లు మంజూరు చేశామని, గుర్తింపు పొందిన స్టార్టప్ల సంఖ్య 1.17 లక్షలకు చేరుకుందని డీపీఐఐటీ జాయింట్ సెక్రటరీ సంజీవ్ తెలిపారు.