తాను టీఆర్ఎస్ ను వీడుతున్నట్టు వస్తున్న వార్తలను ఖండించారు మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానని తెలిపారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు భవిష్యత్ లేదన్నారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ చడ్డీ గ్యాంగ్ సభ్యుల్లా తయారయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్,బీజేపీ అధికారంలోకి వస్తే జనాల్ని దోచుకుని తింటారన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. రాష్ట్రంలో అధికారంలోకి రావడమనేది బీజేపీ,కాంగ్రెస్ లకు కలగానే మిగిలిపోతుందన్నారు.
see more news