
హైదరాబాద్, వెలుగు: హైసియా, హైదరాబాద్ ఫిన్టెక్ ఫోరమ్లు కలిసి కేటలిస్ట్ పేరుతో ఇన్నోవేషన్ కాన్ఫ్లుయెన్స్ను మంగళవారం నిర్వహించాయి. పెద్ద కంపెనీలతో స్టార్టప్లు రిలేషన్షిప్ బలపడేలా దీనిని డిజైన్ చేసినట్లు హైసియా తెలిపింది. కార్పొరేట్ లీడర్లు, స్టార్టప్లను ఒకే వేదికపై తీసుకు రావడమే లక్ష్యమని పేర్కొంది. ఫైనాన్షియల్ సర్వీసెస్ చాలా ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించే సెగ్మెంటని కాన్ఫ్లుయెన్స్లో పాల్గొన్న తెలంగాణ ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ చెప్పారు.
ఎస్ఎఫ్సీ, టీ–వాలెట్, స్త్రీనిధి బ్యాంక్ వంటి ప్రభుత్వ ఆర్థిక సంస్థలతోనూ కలిసి పనిచేయాలని ఆయన స్టార్టప్లకు సూచించారు. దేశంలో ఇన్నోవేషన్ క్యాపిటల్గా హైదరాబాద్ రూపుదిద్దుకుంటోందని హైసియా ప్రెసిడెంట్ మనీషా సాబూ పేర్కొన్నారు. ఫిన్టెక్ రంగంలో మరిన్ని స్టార్టప్లు వచ్చేలా హైదరాబాద్ ఫిన్టెక్ ఫోరమ్ చొరవ తీసుకుంటున్నట్లు ఛైర్మన్ జే ఏ చౌదరి చెప్పారు. నీడ్ ఫర్ ఇనొవేషన్ ఇన్ బ్యాంకింగ్ అనే అంశంపై జేసీ పెన్నీ మేనేజింగ్ డైరెక్టర్ శిరీష ఓరుగంటి మాట్లాడారు.