ఎక్సైజ్ ఆఫీస్​ ఎదుట హనుమాన్​ భక్తుల నిరసన

ఎక్సైజ్ ఆఫీస్​ ఎదుట హనుమాన్​ భక్తుల నిరసన

కోహెడ (హుస్నాబాద్), వెలుగు: హనుమాన్ భక్తుడిపై ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ దాడి చేయడం కలకలం రేపింది. శుక్రవారం పట్టణంలోని ఓ వైన్స్ పర్మిట్ రూంలో పనిచేస్తున్న ఓ స్వామి వద్ద ఎక్సైజ్​కానిస్టేబుల్​ గ్లాసులు తీసుకున్నాడు. డబ్బులు ఇవ్వమన్నందుకు కానిస్టేబుల్ చేయి చేసుకున్నట్లు స్వాములు తెలిపారు. జరిగిన దాడితో ఆగ్రహం వ్యక్తం చేసిన హనుమాన్ భక్తులు పెద్ద ఎత్తున హుస్నాబాద్ ఎక్సైజ్ ఆఫీస్​ఎదుట ఆందోళనకు దిగారు. 

భక్తుడి పై చేయి చేసుకున్న కానిస్టేబుల్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని స్వాములకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.