ప్రపంచవ్యాప్తంగా హనుమాన్(HanuMan) సినిమా సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కాదు. క్రియేటీవ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prasanth Varma) తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది.సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా థియేటర్స్ లో వీరవిహారం చేసింది. కేవలం రూ.40 కొట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇప్పటికి చాలా చోట్ల మంచి కలెక్షన్స్ రాబడుతూ ముందుకు దూసుకుపోతోంది హనుమాన్ మూవీ.
అయితే తాజాగా హనుమాన్ మూవీ మేకర్స్ ఆడియన్స్ కు బంపర్ ఆఫర్ ప్రకటించారు. అదేంటంటే.. హనుమాన్ సినిమా టికెట్ రేట్లు తగ్గిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. మల్టీప్లెక్స్లలో రూ.295 ఉన్న ధరను రూ.150 కి తగ్గించారు. అదేవిదంగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో రూ.175 ఉండగా దానిని రూ.100కి తగ్గించారు. ఈ ఆఫర్ కేవలం ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 23 వరకూ మాత్రమే ఉంటుందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. ఇది మరోసారి హనుమాన్ సినిమా చూడాలనుకునే వారికి బంపర్ ఆఫర్ అనే చెప్పాలి.
The #HanuManRAMpage is not over yet❤️?
— Prasanth Varma (@PrasanthVarma) February 16, 2024
Celebrate the #HanuMania at the most affordable & Lowest prices in the Nizam Area since the release?
Book your tickets now!
- https://t.co/nM6rXb7n54#HanuMan ?
Nizam Release by @MythriOfficial
A @PrasanthVarma film
?ing @tejasajja123… pic.twitter.com/wV0cWFvAA6
ఇక ప్రశాంత్ వర్మ తరువాత చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన అధీర అనే మరో సూపర్ హీరో మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య కొడుకు కళ్యాణ్ దాసరి హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి హనుమాన్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రశాంత్ వర్మ.. అధీరతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.