గిరిజన ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం : హనుమాండ్ల ఝాన్సిరెడ్డి

గిరిజన ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం :  హనుమాండ్ల ఝాన్సిరెడ్డి

పాలకుర్తి (కొడకండ్ల)/ తొర్రూరు, వెలుగు: గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పల్లెబాట కార్యక్రమాన్ని చేపట్టిందని టీపీసీసీ వైస్​ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సిరెడ్డి అన్నారు. శుక్రవారం జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని పెద్దబాయి తండా, బోడోని కుంట తండా, గిర్నితండాల్లో పర్యటించారు. ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా విని, వాటికి పరిష్కార మార్గాలు చూపడమే ధ్యేయంగా కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో మరింత ప్రభావవంతమైన అభివృద్ధి జరగాలంటే, అందరి బాధ్యతగా స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు.

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో తొర్రూరు మండల ఎంపీటీసీ క్లస్టర్ కమిటీ, తొర్రూరు పట్టణ వార్డు క్లస్టర్ కమిటీ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఝాన్సీరెడ్డి మాట్లాడుతూ క్లస్టర్ కమిటీలు పార్టీకి మూలస్తంభాలుగా నిలవాలని, ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో తొర్రూరు మండలంలోని ఎంపీటీసీ క్లస్టర్ కోఆర్డినేటర్, గ్రామ కోఆర్డినేటర్, పట్టణ వార్డు స్థాయి కోఆర్డినేటర్, పట్టణ నేతలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొని తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.