
హైదరాబాద్ వ్యాప్తంగా బోనాలు ఘనంగా జరుపుకుంటున్నారని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. బోనాల పండగ సందర్భంగా శనివారం (జూలై 19) దూల్పేట్లోని మహంకాళి అమ్మవారిని మంత్రి వివేక్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్కు ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి వివేక్.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 100 సంవత్సరాల చరిత్ర గల మహంకాళి అమ్మవారి టెంపుల్ని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. టెంపుల్ను మైయింటైన్ చేస్తోన్న కమిటీ సభ్యులకి, నిర్వాహకులకు అభినందనలు తెలిపారు మంత్రి వివేక్. రాష్ట్రవ్యాప్తంగా మంచి వర్షాలు పడాలని, అందరూ సుఖసంతోషాలతో ఉండాలని మొక్కుకున్నానని తెలిపారు.