SRH vs MI: మాకు ఫ్యాన్స్ ఉన్నారు: హార్దిక్ కాళ్ళు మొక్కిన వీరాభిమాని

SRH vs MI: మాకు ఫ్యాన్స్ ఉన్నారు: హార్దిక్ కాళ్ళు మొక్కిన వీరాభిమాని

మన దేశంలో క్రికెట్ కు ఎంత పాపులారిటీ ఉందనే సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా క్రికెటర్లకు దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఒక్కసారి నచ్చితే అభిమానులు బ్రహ్మరధం పడతారు. అప్పటి సచిన్ నుంచి ఇప్పుడు విరాట్ కోహ్లీ వరకు ఈ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుత ఇండియన్ క్రికెటర్లలో కోహ్లీ, ధోనీ, రోహిత్ శర్మలకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక్కోసారి వీరి కాళ్ళ మీద పడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటారు. తాజాగా ఈ లిస్టులోకి స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య చేరాడు.

Also Read: ఐపీఎల్ రూల్ బ్రేక్.. గిల్‌కు భారీ జరిమానా

ఐపీఎల్ లో భాగంగా నేడు (మార్చి 27) ముంబై ఇండియన్స్ తో  సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ కు ముందు హార్ట్ టచింగ్ మూమెంట్ ఒకటి చోటు చేసుకుంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య వీరాభిమాని ఒకరు ఉద్వేగానికి లోనై పాండ్య వద్దకు వచ్చి  అతని పాదాలను తాకాడు. హార్దిక్ అతన్ని లేపి అతన్ని చిరునవ్వుతో పలకరించి ప్రశంసించాడు. అభిమానితో ఫోటో దిగి తన మంచితనాన్ని చాటుకున్నాడు. 

చివరి రెండు సీజన్ లు ముంబై కెప్టెన్ గా వ్యవహరించిన పాండ్య.. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టును లీడ్ చేస్తున్నాడు. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టుపై ముంబై ఇండియన్స్ జట్టు ఓడిపోయింది. దీంతో నేడు సొంతగడ్డపై సన్ రైజర్స్ పై గెలిచి బోణీ కొట్టాలని ముంబై చూస్తుంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా పాండ్య మొదటి విజయాన్ని అందుకుంటాడో లేదో చూడాలి.