
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు స్లో ఓవర్ రేట్ కారణంగా రూ. 12 లక్షల ఫైన్ పడింది. ఐపీఎల్ 2023లో భాగంగా ఏప్రిల్ 13న పంజాబ్ కింగ్స్ , గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో నిర్ణీత టైమ్లో వేయాల్సిన ఓవర్ల కోటాను అతను పూర్తి చేయించేలేకపోయాడు. దీంతో అతనిపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చర్యలు తీసుకుంది.
తొలి తప్పిదం కావడంతో కేవలం జరిమానాతోనే సరిపెట్టింది. రెండోసారి కూడా హార్దిక్ పాండ్యా స్లో ఓవర్ రేట్ను మెయింటెయిన్ చేస్తే జరిమానా మొత్తం రెట్టింపవుతుంది. 24 లక్షల రూపాయలకు పెరుగుతుంది. ఇక మిగిలిన పదిమంది ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో ఆరు లక్షల రూపాయలు లేదా 24 శాతం జరిమానా పడుతుంది.
ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి బంతి వరకూ అభిమానులకు చాలా టెన్షన్ పెట్టిన ఈ మ్యాచ్ లో చివరి ఓవర్లో ఏడు పరుగులు చేయాల్సి ఉండగా.. గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ రాహుల్ తెవాతియా- ఫోర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. ముందుగా ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అయితే ఈ టార్గెట్ ను ఫినిష్ చేసేందుకు గుజరాత్ చెమటోడ్చింది.