నగరం మునిగింది: రెండు రోజులుగా బీహార్‌లో భారీవర్షాలు

నగరం మునిగింది: రెండు రోజులుగా బీహార్‌లో భారీవర్షాలు

బీహార్‌లో రెండురోజుల నుంచి భారీగా వర్షాలు పడ్డాయి. ఈ ధాటికి బీహార్ రాజధాని పాట్నాలోని పలు ప్రాంతాలు  నీటమునిగాయి. దీంతో బీహార్ సీఎం నితీష్ కుమార్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంతో అత్యవసరంగా సమావేశమయ్యారు. తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆయన అధికారులతో మాట్లాడారు. తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారీగా వర్షాలు పడడంతో వరద తీవ్ర రూపం దాల్చింది. పాట్నా నగరం నీటితో నిండిపోయింది. మెయిన్ రోడ్డుపై ఉన్న పలు దుకానాలు నీటిలో మునిగాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. శనివారం వర్షం వెలిసినా… నీళ్లు మాత్రం రోడ్డుపై అలాగే ఉండిపోయాయి. పాట్నాతో పాటు 13 జిల్లాలలో కూడా వర్షాలు భారీగా కురిశాయి.