
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షం కొనసాగుతోంది. శుక్రవారం రోజంతా కురవడంతో మహబూబాబాద్, ములుగు, జయశంకర్భూపాలపల్లి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో రోడ్లు తెగిపోయాయి. కొత్తగూడ మండలం ఎంచగూడెం శివారులోని వీరేశం కుంటకు గండి పండింది. మహదేవపూర్ మండలం బూరుగుగూడెం, సర్వాయిపేట మధ్యలో రోడ్డు సగం వరకు కొట్టుకుపోయింది.
వెంకటాపూర్ మండలం వెలుతుర్లపల్లి శివారు మోరంచవాగు తెగిపోవడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. గ్రేటర్ వరంగల్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. - వెలుగు, నెట్వర్క్