గోడ కూలి ముగ్గురు, ఆటోపై చెట్టు పడి నలుగురు మృతి

గోడ కూలి ముగ్గురు, ఆటోపై చెట్టు పడి నలుగురు మృతి

బీహార్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. రాష్ట్ర రాజధాని పాట్నాలో ప్రజలు వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. NDRF బృందాలు రంగంలోకి దిగి తక్షణ చర్యలు చేపడుతున్నాయి

ఆదివారం కురిసిన వర్షానికి భగల్‌పూర్ జిల్లాలో గోడ కూలి ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో చోట ఖగౌల్‌లో ఆటోపై చెట్టుపడి నలుగురు వ్యక్తులు మృతి చెందారు. ఈ సంఘటనలపై సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలాలకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.