హైదరాబాద్, వెలుగు: శరీరానికి పోషకాలను అందించే పన్నీర్ గురించి తెలియజేయడానికి ప్రత్యేక ప్రచార కార్యక్రమం ప్రారంభించినట్టు డెయిరీ కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్ ప్రకటించింది. ఇందుకోసం "ఎవ్రీ డే యమ్మీ విత్హెరిటేజ్ పన్నీర్" అనే క్యాంపెయిన్ను నిర్వహిస్తున్నామని తెలిపింది. ఈ ఏడాది డిసెంబర్ వరకు ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ బెంగళూరులలో ఈ కార్యక్రమం జరుగుతుంది.
ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్ భార్గవి ('అమ్మ చేతి వంట' ఫేమ్) ఈ ప్రచారానికి నాయకత్వం వహిస్తారు. పన్నీర్ను ఉపయోగించి వంటకాలు తయారుచేసి, వాటిని హెరిటేజ్ఫుడ్స్ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం ద్వారా ఈ మల్టీ-సిటీ పోటీలో పాల్గొనవచ్చు. విజేతకు బహుమతిగా 10 గ్రాముల 22-క్యారెట్ల బంగారు నాణెం ఇస్తారు. విజేతలు, రన్నరప్లు ఈ ఏడాది డిసెంబర్ మధ్యలో హైదరాబాద్లో జరిగే భార్గవి కుకింగ్ మాస్టర్క్లాస్కు హాజరు కావొచ్చు.
