
సాయి తేజ్, వేద శ్రీ జంటగా సుమైర స్టూడియోస్తో కలిసి హీరో కిరణ్ అబ్బవరం ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. వి.మునిరాజు దర్శకుడు. గురువారం ఈ మూవీకి ‘తిమ్మరాజుపల్లి టీవీ’ అనే టైటిల్ను నిర్ణయిస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్లో సాగే పీరియాడిక్ డ్రామాగా దీన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరలో షూటింగ్ ప్రారంభించనున్నారు. కిరణ్ అబ్బవరం గత చిత్రాలకు కెమెరా అసిస్టెంట్గా పనిచేసిన సాయి తేజ్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతుండగా, ఆన్లైన్ ఎడిటింగ్ చేసిన వి.మునిరాజు దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు.