పల్లవి ప్రశాంత్‌ కనిపించట్లేదు..అతనిపై పెట్టిన కేసు వివరాలను పోలీసులు వెల్లడించాలి : రాజేశ్​కుమార్

పల్లవి ప్రశాంత్‌  కనిపించట్లేదు..అతనిపై పెట్టిన కేసు వివరాలను పోలీసులు వెల్లడించాలి : రాజేశ్​కుమార్

గజ్వేల్, వెలుగు:  బిగ్ బాస్​-–7 విజేత పల్లవి ప్రశాంత్​కు న్యాయం జరిగేలా పోలీసులు సహకరించాలని హైకోర్టు అడ్వొకేట్  రాజేశ్ కుమార్​ కోరారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్​ పట్టణంలోని ప్రెస్​క్లబ్​లో పల్లవి ప్రశాంత్​ తల్లిదండ్రులు గొడుగు విజయమ్మ, సత్యనారాయణతో కలిసి మీడియాతో మాట్లాడారు. 

ప్రశాంత్​పై కేసు నమోదు చేశారని సోషల్​ మీడియాలో పలు రకాల కథనాలు వస్తున్నాయని, అందువల్ల కేసుకు సంబంధించిన అన్ని వివరాలు పోలీసులు వెల్లడించాలని డిమాండ్  చేశారు. సోమవారం నుంచి అతను​కనిపించకుండాపోయాడని ప్రశాంత్  కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. 

ప్రశాంత్​ బిగ్​బాస్​ విజేతగా నిల్చిన తర్వాత అతనిపై కొందరు కక్షపూరితంగా వ్యవహరించినట్టు అనిపిస్తోందన్నారు. పోలీసులు మానవతా దృక్పథంతో ఆలోచించి అతనికి న్యాయం జరిగేలా చూడాలని, కేసు వివరాలను ఆన్​లైన్​లో పెట్టాలన్నారు.