
హాలియా, వెలుగు : దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని ఏకే ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్ సూచించారు. ఆదివారం హాలియా పట్టణంలోని శ్లోక స్కూల్ లో ఏకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు కంప్యూటర్, ఉపాధి కల్పన శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా అనిల్కుమార్ మాట్లాడుతూ దివ్యాంగులు నిరంతరం స్కిల్స్ పెంచుకుంటూ ముందుకు వెళ్తే తప్పకుండా ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. దివ్యాంగులకు ఏకే ఫౌండేషన్, విద్యాధన్ ఫౌండేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం విద్యాధన్ ఫౌండేషన్ ద్వారా ఇంటర్షిప్ కు ఎన్నికైన మదుపు మధుకు మొదటి నెల జీతం ఆయన అందజేశారు.
కార్యక్రమంలో విద్యాధన్ ఫౌండేషన్ చైర్మన్, ఫిక్టీవ్ కంపెనీ ఆపరేషన్స్ హెడ్ ఈదర ప్రసన్న, అమీర్ అలీ ఫౌండేషన్ చైర్మన్ అమీర్ అలీ, ధాత్రి ట్రాన్స్పోర్ట్ఎండీ రవి, ఫౌండేషన్సభ్యులు పులి శ్రీకాంత్, గంగుల అంజియాదవ్, మన్నెం కోటి, శేఖర్ గౌడ్, గంగుల లింగస్వామియాదవ్, బొమ్మిశెట్టి రామలింగయ్య పాల్గొన్నారు.