జీఎస్టీతో ‘‘ఒకే దేశం ఒకే పన్ను’’ అన్న కల నెరవేరిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. జీఎస్టీలో ఇప్పటివరకు కొన్ని సమస్యలు ఉన్నా అన్నీ చక్కబడుతున్నాయని అన్నారు. జీఎస్టీ మొదలైనప్పటి నుంచి రికార్డు స్థాయిలో 2022 జవనరి నెలలో లక్షా 40 వేల 986 కోట్ల జీఎస్టీ వసూలైందని తెలిపారు. జీఎస్టీ విధానం మొదలైనప్పటి నుంచి ఇదే అత్యధికమని ఆమె చెప్పారు. దీనిని బట్టి కరోనా క్రైసిస్లో దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా గాడినపడుతోందని అర్థం చేసుకోవచ్చని బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆమె అన్నారు.
The gross GST collections for the month of January 2022 are Rs 1,40,986 crores which is the highest since the inception of GST: Finance Minister Nirmala Sitharaman#Budget2022 pic.twitter.com/s5P7030KEw
— ANI (@ANI) February 1, 2022